బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ను దాటేసింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ప్రస్తుతం ఆ పార్టీ 118 స్తానాల్లో లీడింగ్లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలే కీలకం. అయితే తమ ఎమ్మెల్యేల(Congress MLAs)ను రక్షించుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ గేమ్ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమిళనాడులోని డీంఎకే నేతలతో కర్నాటక కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
मैं हिंदुस्तान के लोकतंत्र के लिए लड़ता रहूंगा… हमेशा. pic.twitter.com/Ul4A6MqQbc
— Congress (@INCIndia) May 13, 2023