ముంబై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన స్పందించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. తాము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పంజాబ్ ప్రజలు మరో ఆప్షన్గా ఆప్ని ఎన్నుకున్నారని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కూడా ఒక కారణమన్నారు.
మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో మెజార్టీ స్థానాల్లో గెలిచింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్నది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భారీ విజయం సాధించింది. మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 92 సీట్లు గెలుపొందింది. పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 18 స్థానాలకే పరిమితమైంది.