న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security breach)ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఈ వ్యవహారంపై తక్షణమే హోంమంత్రి అమిత్ షా బదులివ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. ఈ అంశంపై అమిత్ షా ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకోగా ఈ ఘటన నుంచి అమిత్ షా తప్పించుకోలేరని అన్నారు.
ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. ఢిల్లీ పోలీసులు, అన్ని భద్రతా సంస్ధలు ఆయన కింద పనిచేస్తున్న క్రమంలో ఈ ఘటన నుంచి అమిత్ షా తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఈ ఘటనపై తాము నిష్పాక్షిక విచారణను కోరుతున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక లోతైన కుట్ర ఉందని, కేంద్ర హోంమంత్రిని ఈ వ్యవహారం నుంచి విడిచిపెట్టలేరని అన్నారు.
అంతకుముందు పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చతో పాటు ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి ప్రకటనకు డిమాండ్ చేస్తూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని ఎంపీలు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సభలోకి వచ్చి మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
Read More :
Oil Palm Cultivation | ఒక్కసారి పెట్టుబడితో 30 ఏండ్ల వరకు ఆదాయం.. సబ్సిడీపై డ్రిప్, ఉచితంగా మొక్కలు