ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు బాలు ధనోర్కర్ (Balu Dhanorkar) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 47 ఏండ్లో ధనోర్కర్.. ఢిల్లీలోని మేదాంత దవాఖానలో (Medanta hospital) చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన చంద్రాపూర్ (Chandrapur) పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన భార్య ప్రతిభా ధనోర్కర్ (Pratibha Dhanorkar) కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కిడ్ని సంబంధిత సమస్యతో (kidney stones) బాధపడుతున్న ఆయన నాగ్పూర్లోని (Nagpur) ఓ దవాఖానతో గతవారం చేరారు. అయితే అనంతరం అతడిని ఢిల్లీకి తరలించారని కాంగ్రెస్ పార్టీ నేత బాలాసాహెబ్ థోరట్ (Balasaheb Thorat) చెప్పారు. కాగా, శివసేనలో (Shiv Sena) తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధనోర్కర్.. చంద్రాపూర్ జిల్లా నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చంద్రాపూర్ ఎంపీగా విజయం సాధించారు. 2019లో కాంగ్రెస్లో చేరిన ఆయన మరోసారి లోక్సభలో అడుగుపెట్టారు.