Back to Congress | ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహదీతోపాటు కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు తిరిగి పార్టీలోకి వచ్చారు. శుక్రవారం అర్థరాత్రి దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసి ఈ సమాచారాన్ని మెహదీ అందించాడు. ఈ కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 9న ఆప్లో చేరారు. ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ల చేరికతో ఎంసీడీలో ఆప్ సీట్లు 134 నుంచి 136
కి పెరిగాయి. అయితే, వీరు రాత్రికి రాత్రే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో ఆప్ సీట్లు మళ్లీ 134 కి చేరాయి.
రాహుల్ గాంధీచ ప్రియాంక గాంధీలకు నమ్మకమైన పనివాడిని. అలాగే కొనసాగుతాను. ఆప్లో చేరి నేను పెద్ద తప్పు చేశాను. రాహుల్, ప్రియాంకతో పాటు ఢిల్లీ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నా గుండెల్లో ఉన్నది. తనతో పాటు ఆప్లో చేరిన ముస్తఫాబాద్కు చెందిన సబిలా బేగం, బ్రిజ్పురి నుంచి నాజియా ఖాతూన్లు కూడా తిరిగి కాంగ్రెస్లో చేరారని అలీ మెహదీ ట్వీట్ చేశారు.
కొత్తగా గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత ఆప్లో చేరడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు వీరు ప్రకటించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తాను, ఇద్దరు కౌన్సిలర్లు ఆప్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆప్లో చేరిన తర్వాత అలీ హెమదీ చెప్పారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో
134 సీట్లు గెలిచి ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 104, కాంగ్రెస్కు 9, స్వతంత్రులకు 3 కౌన్సిళ్లు దక్కాయి.