న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు మందకొడిగా పోలింగ్ మొదలైంది. సామాన్య ప్రజలతోపాటు నేతలు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా రఘువీర్ నగర్లోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రతి ఓటరు ఓటేసేందుకు బయటికి రావాలని కోరారు. మార్పు కోసం ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.