కాంగ్రెస్ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవం తర్వాత ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, పార్టీలో సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి? కొత్త వారిని ఏఏ పద్ధతుల్లో నియమించాలి? అన్న విషయాలను అధ్యయనం చేయాలని, సలహాలు ఇవ్వాలని సీనియర్ సభ్యులను ఆదేశించింది. ఈ కమిటీలో జైరాం రమేశ్, రజనీ పాటిల్, అజయ్ మాకెన్, జితేంద్ర సింగ్, అవినాశ్ పాండే సభ్యులుగా ఉంటారు. ఈ ఐదుగురూ పై అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో ఓ లేఖ విడుదలైంది.
రజనీ పాటిల్ (గోవా), జయరాం రమేశ్ (మణిపూర్), అజయ్ మాకెన్ (పంజాబ్), జితేంద్ర సింగ్ (యూపీ), అవినాశ్ పాండే (ఉత్తరాఖండ్). వీరికి ఈ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. వీరందరూ తమకిచ్చిన రాష్ట్రాల్లో ఓటమి తర్వాత పరిస్థితులు, సంస్థాగత ఏర్పాట్లు, నియామకాలపై అధ్యయనం, సలహాలు చేయనున్నారు.