న్యూఢిల్లీ: స్వాతంత్ర్య 75వ ఏడాది వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఉంటారు. ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, మీరా కుమార్, అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్, భుపిందర్ సింగ్ హుడా, ప్రమోద్ తివారీ, ఎం రామచంద్రన్, కేఆర్ రమేశ్ కుమార్, అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తక్షణం అమలులోకి వస్తుందని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.