కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకున్నది. ఈ స్థానం నుంచి బరిలో నిలవనున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టబోమని ప్రకటించింది. అలాగని ఆమెకు మద్దతుగా కూడా ప్రచారం చేయబోమని కూడా పేర్కొంది. ఈ నెలాఖరులో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే.
సీఎంకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెడితే పరోక్షంగా బీజేపీకి సాయం చేసినట్లే అవుతుంది. పార్టీ అధిష్ఠానం ఆ పని చేయాలని కోరుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఓ టీవీ చానెల్కు చెప్పారు. మెజారిటీ బెంగాల్ కాంగ్రెస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేయాలని ప్రతిపాదించారని అన్నారు. దీనిపై అధిష్ఠానం సలహా తీసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రావడంతో ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికవ్వాల్సి ఉంది. ఆమె కోసం భవానీపూర్ స్థానం నుంచి గెలుపొందిన తృణమూల్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. అందుకోసమే భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది.
కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుంటే తాము బరిలో ఉంటామని లెఫ్ట్ ఫ్రంట్ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ కూటమిగా పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్ను వాయిదా వేయండి..!