(స్పెషల్ టాస్ బ్యూరో, నమస్తే తెలంగాణ) హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం అకడి ఉద్యోగులపై ఉకుపాదం మోపుతున్నది. అన్ఫిట్ సాకు చెప్తూ పదవీ విరమణ చేయాలని బలవంతం చేస్తున్నది. తాజాగా, అక్కడి ఆర్టీసీలో పనిచేస్తున్న 84 మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను తొలగించేందుకు సిద్ధమైంది. మూడు నెలల్లో రిటైర్మెంట్ తీసుకోవాలని, లేకపోతే తామే కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తామని డెహ్రాడూన్, కాఠ్ గోదామ్, టనక్పూర్ ప్రాంతాల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు తాఖీదులు పంపింది.
ఉద్యోగుల భారాన్ని తగ్గించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ బతుకులను బలి తీసుకొంటున్నదని శాపనార్థాలు పెడుతున్నారు. గతంలోనూ 50 ఏండ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు కంపల్సరీ రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటికి సాగనంపింది. అదే.. తెలంగాణలో ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కారు నడుస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక ఇంక్రిమెంట్, ఎన్నడూ లేనంత ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల పట్ల ఉదారతను చాటుకొన్నారు. రిటైర్మెంట్ వయసు మరో మూడేండ్లు పెంచారు. అంగన్వాడీల నుంచి ఆయాలు, ఆశవరర్ల వరకు అందరి జీతాలు పెంచారు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాల పట్టించేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు.