జోధ్పూర్, మే 3: రంజాన్ పండుగ వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈద్ను పురస్కరించుకొని సోమవారం రాత్రి పట్టణంలోని జలోరీ గేట్ సర్కిల్ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాలకు మధ్య వివాదం మొదలైంది.
ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొన్నారు. రాళ్ల దాడిలో పలు ఇండ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పండుగపూట ఎలాంటి అల్లర్లు జరుగకుండా పట్టణంలోని 10 పోలీస్స్టేషన్ల పరిధిలో బుధవారం అర్థరాత్రి వరకు కర్ఫ్యూ విధించిన అధికారులు.. పెద్దయెత్తున బలగాలు మోహరించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. కశ్మీర్లో అనంత్నాగ్లోనూ భద్రతా బలగాలపై కొందరు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.