లక్నో: బైక్పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోసి వేధించారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూశారు. (Muslim family harassed) ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ధాంపూర్ నగరంలో కొందరు వ్యక్తులు ముందుగానే హోలీ వేడుక జరుపుకున్నారు. అక్కడి రోడ్డు మీద బైక్పై వెళ్తున్న ముస్లిం కుటుంబాన్ని ఈ సందర్భంగా వేధించారు. ఇద్దరు మహిళలతో సహా ఒక వ్యక్తిపై రంగు నీళ్లు పోశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారి ముఖాలకు రంగులు పూశారు. ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’ అంటూ మతపరమైన నినాదాలు చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హోలీ పేరుతో ముస్లిం కుటుంబాన్ని వేధించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత పోలీసులను ఆదేశించారు.
क्या यह छेड़खानी नही कहलाएगा??
क्या महिलाओ को रोक कर, धार्मिक नारे लगाकर, ज़बरदस्ती रंग डालना जुर्म नही है??
रमज़ान चल रहा है, लोग खरीदारी करने के लिए बाहर निकलते है!@bijnorpolice #Muslims pic.twitter.com/BAhVmeDoQx
— Zulqarnain ذوالقر نین (@Zulqarn34895931) March 24, 2024
#BijnorPolice
थाना धामपुर क्षेत्र से संबंधित सोशल मीडिया पर वायरल वीडियो के संबंध में स्थानीय पुलिस द्वारा की जा रही वैधानिक कार्यवाही के संबंध में पुलिस अधीक्षक, जनपद बिजनौर की बाइट ।
#UPPolice pic.twitter.com/TBPpgVTIvY— Bijnor Police (@bijnorpolice) March 24, 2024