న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీని తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ బాగ్చీ 2011లో కలకత్తా హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది మొదట్లో ఆయన ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1991లో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన కలకత్తా హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందే వరకు అదే కోర్టులో ప్రాక్టిస్ చేశారు.