కోయంబత్తూర్ ఆత్మాహుతి కారు బాంబు దాడిలో చనిపోయిన వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ సభ్యుడని, స్థానిక ఆలయం మీద దాడి చేసేందుకు ప్రణాళిక రచించాడని జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. అక్టోబర్ 23వ తేదీన కోయంబత్తూర్లో జమేష ముబీన్ అనే 29 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మాహుతి కారు బాంబు దాడిలో చనిపోయాడు. అయితే, ఈ ప్రమాదంలో అతను ఒక్కడు మాత్రమే చనిపోయాడు. కొట్టయిలోని ఈశ్వరన్ దేవాలయం మీద దాడి చేసి విగ్రహాలు, గుర్తులను ధ్వంసం చేయడం ద్వారా హింసకు ప్రేరేపించాలని అనుకున్నాడని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. అతని ఇంటిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, హింసకు ప్రేరేపించే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు పేలుడు పదార్ధాలు, ఎల్పీజీ సిలిండర్ ఉన్న మారుతీ 800 కారుని ఈశ్వరన్ దేవాలయం ఎదుట ముబీన్ పార్క్ చేశాడు. సిలిండర్ పేలడంతో ముబీన్ అక్కడిక్కడే చనిపోయాడు. 2019లో శ్రీలంకలో జరిగిన ఈస్టర్ సండే బ్లాస్ట్ తర్వాత ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ముబీన్ని పోలీసులు విచారించారు. ఈ బాంబు దాడి కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కారు బాంబు దాడికి పాల్పడింది ముబీన్గా గుర్తించారు.