Coimbatore Blast | తమిళనాడులోని 21 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహించింది. కారుబాంబు పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ సందర్భంగా నలుగురు అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసింది. 2022 కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు కేసులో ఐఎస్ఐఎస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసును విచారిస్తుండగా.. శనివారం జరిపిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నది.
ఆరు ల్యాప్టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ కార్డులను, మూడు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సైబర్ నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తుందని ఎన్ఐఏ పేర్కొంది. మద్రాస్ అరబిక్ కాలేజ్, కోవై అరబిక్ కాలేజీకి సంబంధించిన పదకొండు ప్రదేశాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. అరబిక్ తరగతుల ముసుగులో హింసాత్మక ప్రచారం, రాడికలైజేషన్, జిహాద్ని ప్రోత్సహిస్తున్నట్లుగా తేలింది. ఖిలాఫత్, ఐసిస్ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు.. ఐసిస్ కార్యకర్తలు తరగతులను నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదానికి పాల్పడున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
పేలుడు కేసులో అరెస్టయిన 10 మంది నిందితులకు కోయంబత్తూరులోని కోవై అరబిక్ కాలేజీతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. కారుబాంబు పేలుడు కేసుతో సంబంధాఉలన్న మరో పదిచోట్ల ఎన్ఐఏ ఏకకాలంలో తనిఖీలు జరిపింది. 2019లో శ్రీలంక కొలంబో దాడుల్లో 250 మంది మరణానికి కారణమైన శ్రీలంక ఉగ్రవాది జహ్రాన్ హషీమ్ని నిందితులు ప్రశంసించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. పట్టుబడిన ఉగ్రవాదులను జమీల్ బాషా ఉమరి, మౌల్వీ హుస్సేన్ ఫైజీ అలియాస్ మహ్మద్ హస్సేన్ ఫైజీ, ఇర్షాత్, ఇర్షాత్ ఇద్దరు అరబిక్ కాలేజ్ పూర్వ విద్యార్థులుగా వెల్లడైంది. నాల్గో వ్యక్తిని సయ్యద్ అబ్దుల్ రెహ్మా్న్ ఉమారీగా గుర్తించారు.