అలహాబాద్: మైనర్లు సహజీవనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారు తమ భాగస్వామితో కలిసి జీవించడం అనైతికమే కాక, చట్టవిరుద్ధమని పేర్కొంది. 18 ఏండ్లు దాటిన వ్యక్తి మేజర్ అయినప్పటికీ అతడు వివాహ వయసైన 21 ఏండ్లు దాటి ఉండకపోవచ్చునని పేర్కొంది.
గుజరాత్లో 18 ఏండ్ల లోపు యువకుడు మేజరైన ఒక మహిళతో కలిసి జీవించడంపై హైకోర్టు ఈ మేరకు పేర్కొంది.18 ఏండ్ల లోపు నిందితుడు ఒక మేజరైన మహిళతో కలిసి జీవిస్తున్నంత మాత్రాన అతనిపై నమోదైన క్రిమినల్ చర్యలను నిలిపివేయలేమని, అతని చర్య అనైతికమే కాక, చట్టవిరుద్ధం కూడా అని కోర్టు తెలిపింది.