న్యూఢిల్లీ, మే 24: ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు రోచే ఇండియా, సిప్లా.. కరోనా చికిత్స కోసం రెండు ఔషధాలను కలిపి (కాసిరివిమాబ్+ఇమ్డెవిమాబ్) ఒకే మందుగా ‘రోచే యాంటీబాడీ కాక్టెయిల్’ పేరుతో తీసుకొచ్చాయి. భారత్లో ఇది అందుబాటులోకి వచ్చినట్టు సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. యాంటీబాడీ కాక్టెయిల్ ఒక్క డోసు ఖరీదు రూ.59,750. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉండి వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే రిస్క్ ఉన్నవారికి దీనిని వాడతారు. తొలిబ్యాచ్లో లక్ష ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ప్యాకెట్లో రెండు డోసులు ఉంటాయి. ఒక్క ప్యాకెట్తో ఇద్దరికి చికిత్స అందించవచ్చు. కొవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లు, ప్రముఖ దవాఖానల్లో ఈ ఔషధం దొరుకుతుందని కంపెనీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. యాంటీబాడీ కాక్టెయిల్కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగం కింద ఇటీవలే అనుమతినిచ్చింది. దీనికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పటికే అనుమతి ఉంది.