పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. శాంక్విలిమ్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సగ్లానీపై 650 ఓట్ల తేడాలో గెలుపొందారు. విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఘనత పార్టీ కార్యకర్తలకే దక్కుతుందన్నారు. స్వతంత్ర అభ్యర్థి చంద్రకాంత్ శెట్యే బీజేపీకి చెందిన మద్దతు ఇచ్చారన్న ఆయన.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు పేర్కొన్నారు.
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి అడుగు దూరంలో నిలిచి.. 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 11 చోట్ల ముందంజలో ఉన్నది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ మూడు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇదిలా ఉండగా.. ప్రతిష్టాత్మకమైన పనాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అటానాసియో బాబుష్ మోన్సెరేట్ 700 ఓట్ల తేడాతో మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు, స్వతంత్ర అభ్యర్థి ఉత్పల్ పారికర్ను ఓడించి విజయం సాధించారు.