గౌహతి: అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Sharma) తెలిపారు. తొలి దఫా ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత దూకుడుగా మారిందన్నారు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో తమ పార్టీ అద్భుత విజయాలు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో తమ పార్టీపై సెంటిమెంట్ పెరిగిందన్నారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి దశ ఎన్నికలు పూర్తి అయ్యాయని, పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని, తొలి దశ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లు గెలుస్తుందని, ఇక అస్సాంలో 100 సీట్లు, బెంగాల్లో 200 సీట్లు గెలుస్తామని బిశ్వశర్మ అన్నారు.
తమిళనాడు, బెంగాల్లో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ సజావుగా సాగింది. అక్కడ రీపోలింగ్కు ఎటువంటి ప్రతిపాదన రాలేదు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే రోజు పోలింగ్ నిర్వహించారు. కానీ బెంగాల్లో రెండు దఫాలుగా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 151 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక 29వ తేదీన జరిగే రెండో దశ ఎన్నికల్లో 142 స్థానాలకు పోలింగ్ జరగనున్నది.