చండీఘడ్: యువతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా వ్యాపిస్తున్న వైరస్ కేసుల్లో.. 81 శాతం కేసుల్లో యూకే వేరియంట్ ఉన్నట్లు సీఎం వెల్లడించారు. అయితే యూకే వేరియంట్ ప్రమాదకరమని, దాని ఇన్ఫెక్షన్ రేటు కూడా అధికంగా ఉంటుందన్నారు. ఆ యూకే వేరియంట్ వైరస్ను నియంత్రించేందుకు కోవీషీల్డ్ టీకా బాగా పనిచేస్తుందని సీఎం చెప్పారు. కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ రక్షణ నియమావళిని పాటించాలని కెప్టెన్ అమరీందర్ కోరారు. మాస్క్లు ధరించాలని, సోషల్ డిస్టాన్స్ను కూడా పాటించాలన్నారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించకుంటే.. అప్పుడు మరిన్ని కఠిన ఆంక్షలను అమలు చేస్తామని సీఎం అమరీందర్ చెప్పారు.