Smriti Irani| గత తొమ్మిదేండ్లలో దాదాపు 4.46 లక్షల మంది మిస్సింగ్ పిల్లల ఆచూకీ కనుగొన్నామని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. అలా ఆచూకీ కనుగొన్న వారిలో 3.97 లక్షల మందిని వారి కుటుంబాల దరి చేర్చామన్నారు. తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ తెలుసుకోవడానికి 2015లో మహిళా, శిశు అభివృద్ధిశాఖ ప్రారంభించిన ‘ఖోయా- పాయా పోర్టల్’తో ఈ విజయం సాధించామని శనివారం ఓ కార్యక్రమంలో చెప్పారు.
2009-10 ప్రభుత్వ బడ్జెట్లో శిశు సంక్షేమానికి రూ.60 కోట్లు కేటాయిస్తే, గతేడాది రూ.14,172 కోట్లకు పెరిగిందని ఇరానీ స్మృతి తెలిపారు. 2021లో జువెనైల్ జస్టిస్ చట్ట సవరణ ద్వారా చిన్నారుల దత్తత బాధ్యతలను కోర్టులకు బదులు జిల్లా మేజిస్ట్రేట్లకు అప్పగించామన్నారు. ఈ క్రమంలో 2,600 మంది పిల్లలను ఆయా కుటుంబాలు దత్తత తీసుకున్నాయని వెల్లడించారు.