న్యూఢిల్లీ : ఎవరి జీవితంలోనైనా కాలేజీ రోజులు (Viral Pic) ఎంతో ప్రత్యేకమైనవి. ఆ సమయంలో కొత్త స్నేహాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, యవ్వనంలో అడుగుపెట్టడం వంటి మధురానుభూతులు ఎదురవుతాయి. కాలేజ్ క్యాంపస్లో మొగ్గతొడిగిన స్నేహాలు చదువు పూర్తవడంతో ముగిస్తే మరికొన్ని స్నేహ బంధాలు జీవితాంతం కొనసాగుతాయి.
మరికొందరు రీయూనియన్ పేరుతో స్నేహితులతో నిత్యం టచ్లో ఉంటారు. ఇలాంటి ఓ పోస్ట్ ట్విట్టర్లో డాక్టర్ రతిన్ రాయ్ షేర్ చేశారు. 31 ఏండ్లుగా తన ఫ్రెండ్, కేంబ్రిడ్జి క్లాస్మేట్ డాక్టర్ అలీ చీమతో కలిసిఉన్న ఫొటోగ్రాఫ్ను డాక్టర్ రాయ్ షేర్ చేశారు. ఇక డాక్టర్ రాయ్ భారతీయుడు కాగా, డాక్టర్ చీమ స్వస్ధలం పాకిస్తాన్. వీరిద్దరూ కేంబ్రిడ్జి వర్సిటీలో పీహెచ్డీ చేస్తూ ఒకరికొకరు పరిచయమవగా వారి స్నేహ పరిమళం ఇప్పటికీ కొనసాగుతోంది.
So much greatness in one picture. https://t.co/x9ielKnE5h
— Javed Malik (@javedmalik73) July 18, 2023
31 ఏండ్ల స్నేహం..అదే ఆప్యాయతతో ఇప్పటికీ మేం కలుసుకుంటాం..సబ్కాంటినెంట్ స్నేహానికి మీటింగ్ పాయింట్గా నిలిచినందుకు థ్యాంక్యూ లండన్ అని ఈ పోస్ట్కు డాక్టర్ రాయ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ను సోషల్ మీడియాలో 75,000 మందికి పైగా వీక్షించగా, పలువురు నెటిజన్లు రియాక్టయ్యారు. వీరి స్నేహం అందరికీ ఆదర్శమని ఓ యూజర్ కామెంట్ చేయగా, వీరి స్నేహం అమూల్యమని మరికొందరు రాసుకొచ్చారు.
Read More :