ఇంఫాల్: మణిపూర్లో హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes In Manipur) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్కు 65 కిలోమీటర్ల దూరంలోని చురచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 17న కుకీ, జో తెగల ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాలో జోమీ సాయుధ సమూహం జెండాను తొలగించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. మరో వర్గం నేతలు దీనిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జోమి, హరమ్ తెగలకు చెందిన వారు గుంపులుగా చేరుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో 53 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు.
కాగా, ఘర్షణ గురించి తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గుంపులను చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు అధికారి తెలిపారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు ఆదివారం హమర్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. ఈ నేపథ్యంలో
సోమవారం రాత్రి హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే రెండు తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థలు శాంతి అవగాహనకు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరోసారి ఘర్షణ జరిగింది.