Clash with cops : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ట్రక్ డ్రైవర్లు ఎదురుతిరగడంతో సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘర్షణలు జరిగాయి. ఆ ఘటనను మరువకముందే ఇవాళ (మంగళవారం) ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
హిట్ అండ్ రన్ చట్టంలో కొత్తగా చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని మెయిన్పురిలో ధర్నా చేస్తున్న ట్రక్ డ్రైవర్లపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దాంతో ట్రక్ డ్రైవర్లు ఎదురుతిరిగి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
కాగా, భారతీయ న్యాయ సంహితలో భాగంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టంపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా మూడు రోజులపాటు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం ఉదయం నుంచి ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతున్నది.
#WATCH | A clash broke out between truck drivers and police in Uttar Pradesh’s Mainpuri. The drivers are protesting against the new law on hit-and-run cases.
More details awaited. pic.twitter.com/aDHFnjWgK3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 2, 2024