న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని కేంద్రప్రభుత్వం, రాష్ర్టాలను ఆదేశించింది. విద్వేష ఘటనల జాబితాను వారం రోజుల్లో కేంద్రం, రాష్ర్టాలకు అందజేయాలని పిటిషనర్లకు సూచించింది. జాబితాలో నమోదు చేసిన కేసుల్లో తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్తో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది. బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జమైత్ ఉలామై హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ అసద్ మదానీ వేసిన పిటిషన్పై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.