న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ మార్గమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘గ్లోబలైజేషన్ యుగంలో మధ్యవర్తితం’ అనే అంశంపై దుబాయ్లో నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ సదస్సులో జస్టిస్ రమణ శనివారం మాట్లాడారు. చట్టం, మధ్యవర్తిత్వం పరస్పరం విరుద్ధమైనవి కావని పేర్కొన్నారు. రెండింటి లక్ష్యం ప్రజలకు న్యాయం అందించడమేనని తెలిపారు. ‘భారతదేశంలో కోర్టులు మధ్యవర్తిత్వానికి అనుకూలంగా ఉన్నాయి. ఆర్బిట్రేషన్కు మద్దతిస్తాయి.
అవసరమైతే సలహాలు, సూచనలు ఇస్తాయి’ అని జస్టిస్ రమణ చెప్పారు. అయితే, మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్బిట్రేషన్ను ప్రోత్సహించడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని కల్పించడానికి మూడు ప్రభుత్వాంగాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.