న్యూఢిల్లీ, మార్చి 24: విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధం మీద అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హిజాబ్పై నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్లను పరిశీలించింది. విద్యార్థులకు ఈ నెల 28 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణ జరపాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది దేవదత్ కామత్ వాదనను తిరస్కరించింది. ‘పరీక్షలకు, హిజాబ్కు సంబంధం లేదు’ అని స్పష్టంచేసింది. ఈ అంశాన్ని మరింత సున్నితంగా మార్చవద్దు అని కామత్ను కోరింది.