చెన్నై: అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. శనివారం చెన్నైలోని ఐఐటీ-మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఆన్లైన్ వేధింపులకు వేదిక అవుతున్నది. నైతిక విలువలకు ప్రతీకగా నిలిచే టెక్నాలజీ అమలైనప్పుడు ఆ విలువలను మరింత పెంచుతుంది” అని సీజేఐ తెలిపారు.