న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ (మెయిన్స్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు.
అర్హత సాధించిన విద్యార్థులకు ఢిల్లీలో ఏప్రిల్ 5 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లాంటి అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపికచేసేందుకు ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తూ ఉంటుంది.