కొచ్చి, నవంబర్ 24: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ ఖైదీ భార్య బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు అంటే ఏంటో కళ్లకు కట్టారు కొచ్చి సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆర్య. పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు. నలుగురి పిల్లలకు ఠాణాలో ఆశ్రయమిచ్చారు. వారిలో తొమ్మిదినెలల చిన్నారికికి ఆపద సమయంలో ఆర్య పాలిచ్చి మానవత్వం చాటారు.