న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, పౌరులు మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ ఎస్ఎన్ ధింగ్రా సహా పలువురు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు.
సనాతన ధర్మంపై స్టాలిన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని, పైగా ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదంటూ ప్రకటించారని దీనిపై ఆయనను విచారించాలంటూ కోరారు. 262 మంది సంతకం చేసిన ఈ లేఖలో 14 మంది రిటైర్డ్ జడ్జీలు, 130 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 118 మంది మాజీ ఆర్మీ అధికారులు ఉన్నారు.