న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రత(Parliament Security)ను ఇక నుంచి సీఐఎస్ఎఫ్(CISF) చూసుకోనున్నది. ఇటీవల పార్లమెంట్లో భద్రతా వైఫల్య ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. పార్లమెంట్ ఇక నుంచి కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లనున్నది. ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భద్రత అంశాన్ని చూసుకునేవారు. అయితే గత వారం లోక్సభలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లి స్మోక్ అటాక్కు పాల్పడిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఆవరణలో కలర్ క్యాన్లతో అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో భద్రతా మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భద్రతా వైఫల్యంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలని కోరుతూ పార్లమెంట్ విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్లోకి ప్రవేశించే వారిని సీఐఎస్ఎఫ్ దళాలే ఫ్రిస్కింగ్ చేస్తాయి. పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతా బాధ్యత మొత్తం లోక్సభ సెక్రటేరియేట్ చేతుల్లో ఉంటుంది. ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచన ప్రకారం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించారు.