న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. (CISF Officer Saves Passenger’s Life) ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 20న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 నుంచి శ్రీనగర్కు వెళ్లే విమానంలో ప్రయాణించడానికి అర్షిద్ అయూబ్ వేచి ఉన్నాడు. ఉన్నట్టుండి అతడు కుప్పకూలిపోయాడు.
కాగా, ఆ పక్కనే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఒక అధికారి తక్షణం సీపీఆర్ చేశారు. మరో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా అతడికి సహకరించారు. అర్షిద్ అయూబ్ ప్రాణాలు కాపాడారు. కాస్త కోలుకున్న అతడ్ని అంబులెన్స్లో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఎయిర్పోర్ట్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వెంటనే సీపీఆర్ చేసి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ అధికారుల చర్యను నెటిజన్లు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలని, స్కూల్స్, కాలేజీలో విద్యార్థులకు కూడా సీపీఆర్ విధానాన్ని నేర్పించాలని పలువురు సూచించారు.
#WATCH | A quick CPR (Cardiopulmonary resuscitation) to a passenger Arshid Ayoub by the Central Industrial Security Force’s quick reaction team played a crucial role in establising his condition. Ayoub, bound for Srinagar flight from Terminal 2 of the IGI Airport on Tuesday… pic.twitter.com/b21wZG78Oa
— ANI (@ANI) August 22, 2024