కోల్కతా: ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) పన్నెండో తరగతి కెమిస్ట్రీ పేపర్-1 పరీక్ష వాయిదా పడింది. సీఐఎస్సీఈ అనుబంధ పాఠశాలల వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ పేపర్ పరీక్ష సోమవారం ప్రారంభమవడానికి ముందే సామాజిక మాధ్యమాల్లో లీక్ అయినట్లు తెలియడంతో పరీక్షను వాయిదా వేశారు. అయితే సీఐఎస్సీఈ దీనిపై స్పందించలేదు. సీఐఎస్సీఈ డిప్యూటీ సెక్రటరీ సంగీత భాటియా పాఠశాలల ప్రిన్సిపాల్స్కు ఇచ్చిన సమాచారంలో, సోమవారం జరగవలసిన పన్నెండో తరగతి కెమిస్ట్రీ పేపర్-1 పరీక్షను అనూహ్య పరిస్థితుల్లో మార్చి 21కి వాయిదా వేసినట్లు తెలిపారు.