న్యూఢిల్లీ: సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ-20 దేశాల సదస్సుకు చైనా అధ్యక్షుడు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులు ఆ దేశ ప్రధాని లి కియాంగ్ వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
జీ20 సదస్సుకు తాను హాజరు కావడం లేదని, తన బదులు విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోయ్ వస్తారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.