న్యూఢిల్లీ: కొన్ని రోజుల నుంచి తమ దేశ గగన తలంపై చైనా ‘నిఘా బెలూన్’ ఎగురుతున్నదని గురువారం అమెరికా అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థన మేరకు దీన్ని కూల్చేయాలని రక్షణ కార్యదర్శి ఆస్టిన్ అనుకున్నా, కింద ఉండే చాలా మంది ప్రజలకు దాని వల్ల ప్రమాదం కలుగుతుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారు. వాయువ్య అమెరికాలోని భూ గర్భంలో సున్నితమైన ఎయిర్బేస్లు, వ్యూహాత్మక అణు క్షిపణులు ఉన్న ప్రాంతంలో చైనా బెలూన్ ఎగురుతున్నదని అమెరికా అధికారులు తెలిపారు. ఇంటలిజెన్స్ సమాచార సేకరణలో ఈ బెలూన్కు తక్కువ సామర్థ్యం ఉన్నట్టు తెలుసుకున్నామని వారు వెల్లడించారు.