న్యూఢిల్లీ: సరిహద్దును దాటి అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలోకి చొరబడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) 17 ఏండ్ల వయసున్న మిరామ్ తరుణ్ అనే యువకుడిని మంగళవారం కిడ్నాప్ చేసింది. ఈ మేరకు ఎంపీ తపీర్ గవో బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. తరుణ్ స్నేహితుడిని కూడా పీఎల్ఏ దళాలు అపరించాలని ప్రయత్నించినా.. అతను ఎలాగోలా తప్పించుకొని స్థానిక అధికారులకు విషయాన్ని తెలియజేశాడని ఎంపీ వెల్లడించారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్కు విజ్ఞప్తి చేశారు.