బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నారు. ఆ దేశంలో నిత్యం లక్షలాది మంది ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. కరోనా సోకిన వారు వేలల్లో మరణిస్తున్నారు. దీంతో చైనాలోని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రజలు కరోనా మందుల కోసం భారత్వైపు చూస్తున్నారు. భారతీయ యాంటీ కోవిడ్ జెనరిక్ మందులను బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కోవిడ్ మందులు చైనాలో చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ వంటి బ్రాండ్ల జెనరిక్ కోవిడ్ మందుల బాక్స్లను వెయ్యి యువాన్లకు బ్లాక్మార్కెట్లో కొంటున్నారు. చైనా సోషల్ మీడియా వీబోలో ఈ విషయం తెగ వైరల్ అవుతున్నది.
కాగా, భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు. తక్కువ ధరకు లభించే భారతీయ యాంటీ కరోనా మందులను అక్రమ పద్ధతుల్లో, బ్లాక్ మార్కెట్లో కోనుగోలు చేస్తున్నారు. అయితే అక్రమ పద్ధతుల్లో కరోనా మందులు కొనుగోలు చేయవద్దని చైనా ప్రజలను ఆ దేశ వైద్యులు కోరుతున్నారు.
మరోవైపు చైనాలో కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరడంతో జ్వరానికి వినియోగించే పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ వంటి ఆమోదిత భారతీయ మందులకు ఆ దేశంలో డిమాండ్ పెరుగుతున్నది. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ సాహిల్ ముంజాల్ గత వారం రాయిటర్స్కు ఈ విషయం తెలిపారు. ఈ నేపథ్యంలో జర్వ సంబంధ మందుల ఉత్పత్తి, చైనాకు ఎగుమతులను భారతీయ డ్రగ్స్ కంపెనీలు వేగవంతం చేస్తున్నాయని చెప్పారు.