న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ నుంచి కనిపించకుండా పోయిన 17 ఏండ్ల బాలుడిని చైనా ఆర్మీ భారత్కు అప్పగించింది. ఇరు దేశాల సరిహద్దులో అప్పగించినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. అరుణాచల్కు చెందిన టారోన్ అనే బాలుడిని ఈ నెల 19న చైనా సైన్యం అపహరించిందని అరుణాచల్ తూర్పు ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించిన విషయం తెలిసిందే. టారోన్ స్నేహితుడు జానీ యయింగ్ చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకోగలిగాడని ఆయన చెప్పారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం బాలుగు అదృశ్యమైనట్టుగా పేర్కొన్నది. మూలికల కోసం వెళ్లిన అతడు కనిపించకుండా పోయినట్టు తెలిపింది. చైనా సైన్యంతో సంప్రదింపులు జరిపి స్వదేశానికి రప్పించింది.