China | చైనా ప్రభుత్వం తన మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ 15 ప్రాంతాలకు ఆ పేర్లనే తాము ఖాయం చేసుకున్నామని కూడా పేర్కొంది. ఇలా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లను మార్చడం ఇది రెండోసారి. 2017 లోనూ చైనా ప్రభుత్వం ఓ సారి ఇలాంటి ప్రయత్నాలే చేసింది.
చైనా తన మ్యాపులో అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లను మార్చినట్లు ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ సీరియస్గా స్పందించింది. అరుణాచల్ప్రదేశ్ ఎప్పటి నుంచో భారత్లో అంతర్భాగమేనని, ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుందని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. చైనా తన మ్యాపులో ఆయా ప్రాంతాల పేర్లను మార్చినంత మాత్రాన భారత్లో అంతర్భాగం కాకుండా పోదని చురకలంటించింది.