న్యూఢిల్లీ: కాంగ్రెస్కు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులు దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు, ప్రజలకు కూడా ఓ హెచ్చరిక వంటిదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. విపక్షాలన్నింటినీ నాశనం చేయడమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యమని ఆయన విమర్శించారు. మరోవైపు ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ శ్రేణులు పలు రాష్ర్టాల్లో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు ఇప్పటికే సెటిల్ చేసుకొన్న ఒక కేసులో ఐటీ శాఖ తనకు నోటీసులు పంపిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కాగా, ఐటీ శాఖ నుంచి మరో రెండు నోటీసులు అందాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు.