రాయ్పూర్: రిజర్వాయర్లో పడ్డ ఫోన్ను తీసుకునేందుకు మొత్తం నీటిని ఖాళీ చేయించిన అధికారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.53,092 జరిమానా విధించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేశ్ విశ్వాస్ ఈ నెల 21న పరల్కోట్ రిజర్వాయర్లో ఫోన్ పడేసుకున్నాడు. ఫోన్ తీసుకునేందుకు ఏకంగా రిజర్వాయర్ నీటిని మొత్తం ఖాళీ చేయించాడు. అతడు 4,104 క్యూబిక్ మీటర్ల(41 లక్షల లీటర్ల) నీటిని వృథా చేసినట్టు ఆ రాష్ట్ర నీటి వనరుల శాఖ తేల్చింది.
ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.10.50 చొప్పున అతడికి రూ.43,092 జరిమానా విధించింది. అనుమతి లేకుండా నీటిని తోడేసినందున మరో రూ.10 వేలు జరిమానా వేసింది. ఇప్పటికే అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, రాజేశ్ ఫోన్ విలువ రూ.96 వేలు. మరోవైపు నీటిని తోడేసేందుకు నోటి మాట ద్వారా అనుమతి ఇచ్చిన నీటి వనరుల శాఖ ఎస్డీవో ఆర్సీ ధివర్కు ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చారు.