రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరో జవాన్ నారాయణపూర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని జీవాలాపాదార్ రహదారిపై నక్సలైట్లు ఐఈడీని అమర్చి ఉంటారని అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు.
ఐటీబీపీ, డీఆర్జీ జవాన్ల బృందం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరిన సమయంలో ఘటన చోటు చేసుకున్నది. నక్సల్స్ ఈ నెల 23 నుంచి 29 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. అయితే, జిల్లాలోని అన్ని పోలీస్ క్యాంపులు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులను అప్రమత్తం చేశామని, అంతర్గత ప్రాంతాల్లో సైనికులచే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఏఎస్పీ తెలిపారు.