రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది. పార్టీ సీనియర్ నేతలైన సీఎం భూపేష్ బాఘేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్ఛార్జి పీఎల్ పునియాతో భేటీ కానున్నట్లు సమాచారం. 2018లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు బాఘేల్తోపాటు డియో సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ 17తో రెండున్నర ఏండ్ల అధికారాన్ని సీఎం బాఘేల్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అధికారం పంచుకునే విషయంపై నాటి ఒప్పందాన్ని డియో గుర్తు చేయనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సీఎం పదవి మార్పు విషయంపై సీఎం బాఘేల్, మంత్రి డియో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని వారిద్దరూ చెబుతున్నారు. కాగా, ఆగస్ట్ 17న సీఎం బాఘేల్ రాజీనామా చేస్తారని డియో చెప్పినట్లుగా ఒక న్యూస్ వెబ్సైట్లో వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని చెడగొట్టేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్పై చర్యలు తీసుకోవాలని డియో డిమాండ్ ఇటీవల చేశారు.