రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగల్ ఇవాళ ఓ వెరైటీ బ్రీఫ్కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆవు పేడతో తయారైన బ్రీఫ్కేస్లో ఆయన బడ్జెట్ పత్రాలను అసెంబ్లీకి తీసుకువచ్చారు. పర్యావరణ హితమైన బ్రీఫ్కేసును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం భగల్ ఆ సూట్కేస్తో వచ్చారు.
ఆవు పేడకు చెందిన పొడి, బొగ్గు పొడి, మైదపొడి, ఇతర పదార్ధాలతో ఆ బ్రీఫ్కేసును తయారు చేశారు. రాయ్పూర్ గోకుల్ థామ్కు చెందిన మహిళా సంఘం ఈ ఆవుపేడ బ్రీఫ్కేసును రూపొందించారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్కేస్తో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇండియాలో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది.