Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అంబికాపూర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఈ నలుగురు పసికందలు చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ‘ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారు. వాళ్లలో ఇద్దరినీ వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే 4 గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉదయం 5ః30 నుంచి 8ః30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారు’ అని జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ వెల్లండిచారు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఆ పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది మొదట బయటపెట్టలేదు. కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టడంతో చివరకు అసలు విషయం చెప్పారు.
‘ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించాల్సిందిగా హెల్త్ సెక్రటరీని ఆదేశించాను. ఈ విషాదకరమైన సంఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలసుకునేందుకు అంబికాపూర్ ఆస్పత్రికి వెళ్తున్నాను. దర్యాప్తు తర్వాత బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో వెల్లడించారు.