Fire in Bus : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) నుంచి మధురై (Madhurai) వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు (Private Sleeper Coach Bus) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజమున పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచిరాపల్లి (Chennai-Thiruchirapally) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
బస్సులో మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపి ప్రయాణికులను కిందకు దింపేశారు. దాంతో అందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.