చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విమానాల రాకను నిలిపివేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరుతాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.