న్యూఢిల్లీ, డిసెంబర్ 27: చేపలు, మాంసంలాంటి ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువగా రసాయనాలను వాడుతుంటారు. మనం వాటిని కొని ఇంటికి తీసుకెళ్లాక వాసనొస్తున్నదని బాగా కడుగుతాం. వాసనపోకుంటే ఉప్పు, పసుపుతో మళ్లీ కడుగుతాం. తర్వాత వండుకొని తింటాం. అయినా వాసనపోలేదని బాధపడుతుంటాం. అయితే ఇలాంటి ఆహారపదార్థాలపై ఉండే విష రసాయనాలను ముందే గుర్తించే సెన్సర్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనితో ఆహారపదార్థం నిల్వ ఉంచిందా? లేక దానిపై విష రసాయనాలు ఉన్నాయా? అన్న విషయాన్ని వెంటనే గుర్తించవచ్చు.