రోడ్డుపై రూపాయి దొరికినా జేబులో వేసుకునే రోజులివి. కానీ ఛత్తీస్గఢ్కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తనకు దొరికిన రూ.45లక్షల బ్యాగును ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని నయారాయ్పూర్లోని కవబందా పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ నీలాంబర్ సిన్హా తెల్లవారుజామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. తెరిచిచూడగా.. నిండా రూ.2000, రూ.500 నోట్లకట్టలే కనిపించాయి.
సుమారు రూ.45లక్షల వరకు ఉన్నాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించిన నీలాంబర్ సిన్హా.. సివిల్లైన్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి దానిని అప్పగించారు. సిన్హా నిజాయితీకి మెచ్చిన అధికారులు అతడిని అభినందించడంతోపాటు రివార్డునూ ప్రకటించారు.